Home Cinema Mahesh-Allu Arjun : మోసపోయిన మహేష్ బాబు.. అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేసాడు..

Mahesh-Allu Arjun : మోసపోయిన మహేష్ బాబు.. అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేసాడు..

Mahesh Babu Allu Arjun : కొన్ని కొన్ని సార్లు మనకి ఇష్టమైన హీరోలు అద్భుతమైన సినిమాలను మిస్ అయ్యినప్పుడు అబ్బా ఎలాంటి సినిమా మిస్ అయ్యాడు మా హీరో, ఈ చిత్రం మా హీరో పడి ఉంటే రికార్డ్స్ మొత్తం గల్లంతు అయ్యేవి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు ప్రస్తుత తరం లో స్టార్ హీరోలు గా కొనసాగుతున్న వాళ్ళందరి విషయం లో జరిగింది. వారిలో మహేష్ బాబు కూడా ఒకడు. గతం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘జులాయి’ అనే చిత్రం విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

allu-arjun-mahesh-babu

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా అల్లు అర్జున్ కి భారీ హిట్ ఇవ్వడమే కాకుండా, ఆయన కెరీర్ లో క్లాసిక్ గా కూడా నిల్చింది. ఇప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా బయట హీరోల అభిమానులకు కూడా ఎంత ఇష్టమైన సినిమా ఇది. ముఖ్యంగా హీరో మరియు విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ అప్పట్లో ఆడియన్స్ ని చాలా థ్రిల్ కి గురి చేసింది. ఆరోజుల్లోనే ఈ సినిమా సుమారుగా 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కథని ముందుగా అల్లు అర్జున్ తో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యాలనుకున్నాడు త్రివిక్రమ్.

‘ఖలేజా’ సినిమా కథ వినిపించడానికి వెళ్ళినప్పుడు ‘ఖలేజా’ తో పాటుగా ‘జులాయి’ సినిమా లైన్ కూడా చెప్పాడట త్రివిక్రమ్. మహేష్ బాబు(Mahesh Babu Allu Arjun) కి రెండు కథలు కూడా బాగా నచ్చాయి, కానీ ముందుగా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఎక్కువగా ఉన్న ఖలేజా సినిమా చేద్దాం అని అన్నాడట మహేష్ బాబు. అలా ప్రారంభమైన ఈ సినిమా అప్పట్లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీనితో ఒకరోజు జులాయి మూవీ కి సంబంధించి చర్చల కోసం వెళ్లిన త్రివిక్రమ్ తో, కొంతకాలం బ్రేక్ ఇద్దాము, ఇప్పుడే మన కాంబినేషన్ లో సినిమా వద్దు అని అన్నాడట మహేష్.

త్రివిక్రమ్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఇదే స్టోరీ ని అల్లు అర్జున్ ని వినిపించగా ఆయనకీ తెగ నచ్చేసింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమాని చేసారు. ఇక ఆ తర్వాత ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి, ఇప్పుడు త్వరలోనే నాల్గవ సినిమా కూడా రాబోతుంది.

Exit mobile version