Home Cinema Janhvi Kapoor : మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కి ఆ శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.....

Janhvi Kapoor : మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కి ఆ శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. వీడియో చుడండి..

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు బడా ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఒకటి బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న సినిమా లో రామ్ చరణ్ సరసన నటిస్తూనే, మరోపక్క ఎన్టీఆర్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాలో కూడా నటిస్తుంది. శ్రీదేవి కూతురు కాబట్టే తనకి ఈ అవకాశాలు వచ్చాయి, లేకపోతే వచ్చేవా ? వచ్చిన ఈ అవకాశాలతో తానేంటో నిరూపించుకుంటుంది అని అనుకుందాం.

బాలీవుడ్ లో పెద్ద సక్సెస్ రాక తల్లిని బాగా ఆదరించిన మన తెలుగు ఇండస్ట్రీ లో తన అదృష్టం పరీక్షించుకుంటుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం జాన్వీ కి సంబంధించి ఒక విషయం తెగ వైరల్ అవుతుంది. జాన్వీ తన స్నేహితులు మరియు బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో కలిసి ఏడుకొండల వారిని దర్శించుకునేందుకు తిరుమల విచ్చేసింది. అందరిలానే మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళింది జాన్వీ, ఇంకా మోకాళ్ల పర్వతం వచ్చాక మోకాళ్ల మీదే ఎక్కి ఆ వెంకయ్య వారిని దర్శించుకుంది.

janhvi-kapoor-thirumala

ఇప్పుడు జాన్వీ చేసిన ఈ పనిని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. పాపకు ఎంత దైవ భక్తి అంటూ కొందరు యూజర్లు అనగా, మరికొందరు తన సినిమా హిట్ అవ్వాలి అనే ఇలా చేసింది అంటున్నారు. మరికొందరు ఏమో లేదు జాన్వీ కి ముందు నుంచే దైవ భక్తి ఎక్కువ తాను ఎప్పుడు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తూనే ఉంటుంది అంటూ పొగడ్తలతో ముంచేశారు.

Exit mobile version