Home Cinema Jr NTR : ఎన్టీఆర్ పై కేసు నమోదు.. హై కోర్ట్ ను సంప్రదించాడు..

Jr NTR : ఎన్టీఆర్ పై కేసు నమోదు.. హై కోర్ట్ ను సంప్రదించాడు..

Jr NTR : ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈయన గత రెండు దశాబ్దాలుగా సినిమాలో నటిస్తున్నాడు. ఈయన నటనకు బోలెడంతమంది అభిమానులు కూడా ఉన్నారు. ఈయన ప్రస్తుతం హీరోగా దేవర అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సినిమాలలో ఎంత బిజీ ఉన్న సరే తన కుటుంబ సభ్యులతో తన విలువైన సమయాన్ని కూడా గడుపుతుంటాడు. హైదరాబాద్‌లో ఆయనకు సొంత నివాసం ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈయన ఇంటికి సంబందించిన ఓ ఇష్యూ వల్ల వార్తలలో నిలిచాడు. జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్‌లో స్థలాన్ని రెండు దశాబ్దాల క్రితం 2003లో సుంకు గీతాలక్ష్మి నుంచి తారక్ కొనుగోలు చేశారు. అయితే గత కొన్నాళ్లుగా తారక్ కొనుగోలు చేసిన భూమిపైన పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైందని, ఇప్పుడు ఆ అప్పులను రికవరీ చేయాలని ఈ బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయి అని మనకు సమాచారం. ఈ విషయం ఎన్టీఆర్ కి తెలియదు.

jr-ntr-approached-high-court-here-is-the-reason

ఈ క్రమంలో బ్యాంకులకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించడంతో ఎన్టీఆర్ తన ఆస్తుల విషయంలో జరిగిన మోసంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో డెట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందుగా తమతో సంప్రదింపులు జరపాలని న్యాయమూర్తులు గుర్తు చేశారు. అయితే డీఆర్‌టీ ఆర్డర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తారక్ తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా పడింది. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version