Home Cinema Priyamani : అంత అదృష్టం నాకు లేదు అంటూ ఏడ్చేసిన ప్రియమణి.. మొత్తానికి నిజం బయటపెట్టేసింది..

Priyamani : అంత అదృష్టం నాకు లేదు అంటూ ఏడ్చేసిన ప్రియమణి.. మొత్తానికి నిజం బయటపెట్టేసింది..

Priyamani : డస్కీ బ్యూటీ గా మంచి పేరు తెచ్చుకొని, నటన పరంగా నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్న హీరోయిన్ ప్రియమణి. ‘ఎవరి అతగాడు’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, జగపతి బాబు హీరో గా నటించిన ‘పెళ్ళైన కొత్తలో’ అనే సినిమా ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించింది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అసలు రాలేదు(Priyamani Pushpa). వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకొని అనతి కాలం లోనే సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం హీరోల పక్కన హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కూడా ఈమె మంచి క్రేజ్ ని సంపాదించింది.

actress-priyamani

ఇండస్ట్రీ లోకి కొత్తగా ఎంతమంది హీరోయిన్స్ వస్తున్నా కూడా , ఈమె డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు అంటే , ఆమెలో ఉన్న టాలెంట్ వల్లే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆమెకి హీరోయిన్ రోల్స్ అయితే పెద్దగా రావడం లేదు కానీ, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రం చాలా బలంగానే వస్తున్నాయి. రీసెంట్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ సినిమా హిట్ అవ్వడం తో పాటుగా, ఆ పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం తర్వాత ప్రియమణి మరో రెండు మూడు క్రేజీ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించే ఛాన్స్ దక్కింది.

అయితే ఈమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ పుష్ప 2 లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుందని, ఈ కథలో ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని, ఆమె వచ్చిన తర్వాత సినిమా మొత్తం మారిపోయి మరో లెవెల్ కి వెళ్తుందని ప్రచారం జరిగింది. ఈ వార్త పై ప్రియమణి స్పందిస్తూ ‘పుష్ప 2 లో నేను నటించబోతున్నాను అని వార్తలు వచ్చాయి(Priyamani Pushpa). అంత అదృష్టం నాకు లేదు, అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం వస్తే నేను అసలు మిస్ అవ్వను, కానీ నన్ను పాత్ర కోసం ఎవ్వరూ ఆ సినిమా అప్రోచ్ అవ్వలేదని చెప్పుకొచ్చింది ప్రియమణి.

దీంతో సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే రూమర్స్ కి చెక్ పడింది. ఒకప్పుడు టాప్ హీరోల సరసన నటించిన ప్రియమణి ఇపుడు ఎక్కువగా టీవీ షోస్ లో జడ్జి గా వ్యవహరిస్తోంది. ఇపుడు మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయింది అని సూచనలు కనిపిస్తున్నాయి. మెల్లి మెల్లిగా మల్లి తినకు మూవీ ఆఫర్ లు రావటం ప్రారంభం అయ్యాయి.

రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరో గా నటించిన యమదొంగ సినిమాతో ప్రియమణి టాలీవుడ్ లో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమా తన కెరీర్ కె ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

Exit mobile version