Home Cinema Sai Dharam Tej: మూడ్ తెచుకోవటానికి ఆ వీడియోలు చూస్తా.. స్వయంగా చెప్పేసిన సాయి ధరమ్...

Sai Dharam Tej: మూడ్ తెచుకోవటానికి ఆ వీడియోలు చూస్తా.. స్వయంగా చెప్పేసిన సాయి ధరమ్ తేజ్..

Sai Dharam Tej: మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ అతి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వై వీ ఎస్ చౌదరి తెరకెక్కించిన ‘రేయ్’ చిత్రం అయన మొట్టమొదట కెమెరా ని ఫేస్ చేసింది. కానీ తొలిసినిమా గా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలై మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత రేయ్ చిత్రం విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది(Sai Dharam Watches Videos). అయినా కూడా సాయి ధరమ్ తేజ్ కి నటుడిగా మంచి పేరే వచ్చింది. కామెడీ టైమింగ్ బాగుంది, కుర్రాడి పెర్ఫార్మన్స్ లో మంచి ఎనర్జీ కూడా ఉంది అంటూ అందరూ ప్రశంసించారు.

Sai-dharam-tej-watches-those-videos-to-get-mood-during-shooting-breaks

ఆ తర్వాత ఈయనకు కెరీర్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తగిలాయి, ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరో గా మంచిగా స్థిరపడ్డాడు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే సాయి ధరమ్ తేజ్ కి ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే తన ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి పాత సినిమాలకు సంబంధించిన కామెడీ సన్నివేశాలు కానీ, లేదా జబర్దస్త్ పాత వీడియో లు కానీ చూడడం అలవాటు అట(Sai Dharam Watches Videos). అలా చూసి బాగా నవ్వుకొని రిలాక్స్ అవుతాడట. ఈ విషయం తెలుసుకొని అభిమానులు నువ్వు కూడా జబర్దస్త్ ప్రోగ్రాం ని బాగా ఫాలో అవుతావా అన్నా అంటూ సాయి ధరమ్ తేజ్ ని ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు.

ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన ‘విరూపాక్ష’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. బైక్ యాక్సిడెంట్ తర్వాత ఆయన నుండి వచ్చిన మొట్టమొదటి సినిమా ఇదే. ఇక రీసెంట్ గా తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో ది అవతార్’ చిత్రం చేసాడు. ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం యావరేజి అని అనిపించుకుంది. అలా సాయి ధరమ్ తేజ్ రీ ఎంట్రీ తర్వాత మంచి క్వాలిటీ సినిమాలే చేస్తున్నాడు, ఇదే క్వాలిటీ మెయిన్ టైం చేస్తే ఆయన కెరీర్ వేరే లెవెల్ కి వెళ్తుంది అని చెప్పొచ్చు.

సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో, విరూపాక్ష బాగానే ఆడాయి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష 2 సినిమా పై ఇపుడు పని చేస్తున్నాడు. ఈ సినిమా 1 కి సీక్వెల్. ఈ పార్ట్ లో కూడా సంయుక్త మీనన్ ఏ హీరోయిన్. ఈ సినిమా పై స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేసారు. సాయి ధరమ్ తేజ్ అలాగే ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాయి ధరమ్ తేజ్ మొత్తానికి ఒక లైన్ లో పడ్డాడు అనే చెప్పాలి. సినిమాల పై సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈ కుర్ర మెగా హీరో.

Exit mobile version