Home Cinema Rajinikanth : ఆ స్టార్ హీరోయిన్ ముందు రజినీకాంత్ పరువు తీసిన డైరెక్టర్.. ఆగ్రహం వ్యక్తం...

Rajinikanth : ఆ స్టార్ హీరోయిన్ ముందు రజినీకాంత్ పరువు తీసిన డైరెక్టర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తుం అభిమానులు..

Rajinikanth : సౌత్ ఇండస్ట్రీలో రజినీకాంత్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. రజిని ఇటీవల జైలర్ అనే సినిమాతో చాల రోజుల తరువాత ప్రేక్షకుల ముందు కు రాబోతున్నాడు. జైలర్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది మరియు ఈ సినిమా కోసం రజిని ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రజిని చేస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్.

this-director-insulted-rajinikanth-infront-of-this-star-heroine

అయితే నిన్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇపుడు ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రజిని నెల్సన్ గురించి ఏమన్నాడో ఇపుడు మనం తెలుసుకుందాం. అయితే అప్పట్లో రజినీకాంత్ మరియు రమ్యకృష్ణ కలిసి నటించిన చిత్రం నరసింహ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.

నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పొగరు బోతు క్యరెక్టర్ చేసింది మరియు ఈ పాత్రలో రమ్య అందరిని ఆకట్టుకుంది. తనకు ఇచ్చిన పాత్రలో రమ్య నట విశ్వరూపం చూపించింది. అయితే ప్రస్తుతం వీరు ఆ సినిమా తరువాత మల్లి ఇప్పుడు కలిసి ఒకే తేరా మీద కనిపిస్తున్నారు జైలర్ అనే సినిమా ద్వారా. అయితే రజినికాంత్ రమ్య కలిసి ఓ సీన్ కోసం షూటింగ్ చేస్తుండగా దర్శకుడు నెల్సన్ రజిని సార్ మల్లి చేదాం.. మల్లి చేదాం.. అని చాలా టేక్స్ తీసుకున్నాడు.

ధీనితో ఆయనకు కోపం వచ్చి డైరెక్టర్ ను తిట్టేశాడట. ఈ విషయమే రజిని(Rajinikanth) గారు స్టేజి పైన చెప్పి ఇన్ని సంవత్సరాల తరువాత నీలాంబరి పక్కన నటిస్తుంటే ఈ డైరెక్టర్ నా పరువంతా తీసాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరియు రజినీకాంత్ అభిమానులు ఈ దర్శకుడు కావాలనే నీలాంబరి దెగర నరసింహ పరువు తీసాడు అంటూ ఫన్నీ గా కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version