Friday, September 20, 2024
HomeCinemaRashmika Mandanna : హీరోయిన్ రష్మికకు ఆ మాంసం తింటే కానీ తృప్తిగుండదట.. స్వయంగా తానె...

Rashmika Mandanna : హీరోయిన్ రష్మికకు ఆ మాంసం తింటే కానీ తృప్తిగుండదట.. స్వయంగా తానె చెప్పింది..

Rashmika Mandanna : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత బాలీవుడ్ , కోలీవుడ్ లలో కూడా స్టార్ హీరోల సరసన నటించి చూస్తూ ఉండగానే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన నటి రష్మిక మందన. నాగ శౌర్య హీరో గా నటించిన ‘చలో’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రష్మిక ని చూసినప్పుడు ఆడియన్స్ ఎవ్వరూ కూడా ఆమె ఈ రేంజ్ కి ఎదుగుతుందని ఊహించలేకపోయారు. చిన్న సినిమా ద్వారా పరిచయమైనా ఈ హీరోయిన్ ఇప్పుడు ఆరు కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ ని తీసుకునే స్థాయికి వెళ్ళింది.

rashmika-mandanna-love-eating-pig-meat-she-shared-this-with-her-fans

ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎనిమల్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ తో కూడా నటించబోతుంది. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే రష్మిక(Rashmika Mandanna) కారణంగా ఆమె విచిత్రమైన అలవాట్లు , ఇష్టమైన ఆహరం గురించి అభిమానులకు తెలుసుకునే అదృష్టం కలిగింది.

actress-rashmika-mandanna

భీష్మ మూవీ ప్రోమోషన్స్ లో పాల్గొన్నప్పుడు, రష్మిక మందన అలవాట్లు గురించి హీరో నితిన్ అప్పట్లో చెప్పిన కొన్ని మాటలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. రష్మిక కి కుక్క బిస్కెట్స్ అంటే ఇష్టమనీ, ఖాళీగా ఉన్న సమయం లో కుక్క బిస్కెట్స్ తింటూ కనిపించేది అంటూ అప్పట్లో రష్మిక కి సంబంధించిన సీక్రెట్ ని బయటపెట్టాడు. అంతే కాకుండా ఈమధ్యనే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రష్మిక కి తనకి ఈతో ఇష్టమైన ఆహారం గురించి చెప్పుకొచ్చింది.

rashmika-mandanna

తనకి పంది మాంసం అంటే ఎంతో ఇష్టమనీ, మా సంప్రదాయం ప్రకారం మేము పందిమాంసం తినాలి కాబట్టి, చిన్నప్పటి నుండి నాకు బాగా అలవాటు అయ్యిందని. పందిని కాల్చుకొని తిన్న తర్వాత, ఒక ప్రత్యేకమైన వైన్ తాగుతామని. అది తాగినప్పుడు స్వర్గం లోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తాడని రష్మిక ఈ సందర్భంగా చెప్పింది.

అంతే కాదు వైన్ ని వాళ్ళ ఇంట్లోనే తయారు చేసేవారట. ఇదంతా విని రష్మిక అభిమానులు మరియు నెటిజెన్స్ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కర్ణాటక లో ఎక్కువగా పంది మాంసం ని బాగా తింటారు. కాంతారా చిత్రం లో మనం చూసే ఉంటాము. రష్మిక కర్ణాటక కి చెందిన అమ్మాయి కాబట్టి ఆమెకి ఈ అలవాటు అయ్యింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts