Saturday, September 21, 2024
HomeCinemaAnchor Rashmi : ఇండస్ట్రీలో అందరూ వాడుకొని వదిలేసారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ రష్మీ..

Anchor Rashmi : ఇండస్ట్రీలో అందరూ వాడుకొని వదిలేసారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ రష్మీ..

Anchor Rashmi : తెలుగు బుల్లితెర మీద యాంకర్ గా ఒక వెలుగు వెలుగుతూ యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న వారిలో ఒకరు రష్మీ. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన యాంకరింగ్ స్కిల్స్ తో అలరించిన రష్మీ, ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఆమె తన మొదటి సినిమా సిద్దు జొన్నలగడ్డ తో కలిసి ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రం లో నటించింది(Anchor Rashmi Cheated). ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి రష్మీ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

anchor-rashmi-reveals-that-she-got-cheated-by-many-directors-in-the-name-of-offering-a-movie

ఈ చిత్రం తర్వాత ఆమెకి సినిమాల్లో అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, అన్నీ బి గ్రేడ్ సినిమాలే అవ్వడం విశేషం. ఆమె చేసిన సినిమాలన్నిట్లో దెయ్యం పాత్రలు, లేదా నెగటివ్ రోల్స్ ని మాత్రమే ఇచ్చేవారు దర్శక నిర్మాతలు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అందం, టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు ఇంకా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు అని అడగగా దానికి రష్మీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ తనకి సినిమాల్లో అవకాశాలు బాగానే వచ్చాయని, మంచి మంచి పాత్రల్లో నటించే ఛాన్స్ దక్కింది, కానీ ఈ డైరెక్టర్స్ నన్ను చాలా మోసం చేసారు(Anchor Rashmi Cheated).

anchor-rashmi

ముందుగా నన్ను ఒక పాత్రలో తీసుకుంటారు, నేను షూటింగ్ కి వెళ్లిన రోజు నా స్థానం లో మరొకరు ఉంటారు. ఇలా ఎన్నో సార్లు జరిగింది, అందుకే నేను ఇండస్ట్రీ లో నటిగా సక్సెస్ కాలేకపోయాను అంటూ వాపోయింది. తనని ఇండస్ట్రీ లో అందరూ అవసరాలకు తగ్గట్టు వాడుకునేవారే కానీ, అవకాశాలు మాత్రం ఇవ్వలేదని, ఇంత కుళ్ళు రాజకీయాలు ఉంటాయని తెలిస్తే నేను అసలు సినిమాల్లోకి వెళ్లేదానిని కాదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె జబర్దస్త్ మరియు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

anchor-rashmi-gautam

వీటితో పాటుగా ఈటీవీ లో ఏ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ప్లాన్ చేసిన రష్మీ యాంకర్ గా ఉండాల్సిందే. ఇక బుల్లితెర పై సుధీర్ – రష్మీ కాంబినేషన్ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆడియన్స్ ఈ కాంబినేషన్ ని బాగా మిస్ అవుతున్నారు. యాంకర్ రష్మీ ఇప్పటి వరకు చేసిన ఒక మంచి సినిమా లేదు. అన్ని సినిమాలు భూతే.

గుంటూరు టాకీస్, అంతం, చారుశీల అన్ని బూతు సినిమాలే. కానీ ఇప్పుడు మదం రూట్ మార్చేశారు, ఇప్పటి నుండి అన్ని మంచి కథలు ఉన్న సినిమాలను మాత్రమే చేయాలి అన్ని ఫిక్స్ అయింది అంట. చూదాం మరి తాను చేయబోయే తరువాయి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts