Saturday, September 21, 2024
HomeCinemaNagarjuna: లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలని నాగార్జున ఎందుకు పెళ్లి చేసుకున్నాడు..

Nagarjuna: లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలని నాగార్జున ఎందుకు పెళ్లి చేసుకున్నాడు..

Nagarjuna: అక్కినేని నాగార్జున తొలుత దగ్గుపాటి రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుపాటి కి ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వర రావు తో ఎప్పటి నుండో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తన కూతురిని నాగార్జున కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆశపడ్డాడు. నాగార్జున అమెరికా లో పై చదువులు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత వెంటనే పెళ్లి లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసేసాడు(Nagarjuna Amala Lakshmi). అప్పటికి ఆయన ఇండస్ట్రీ లో కూడా అడుగుపెట్టలేదు. 1984 వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లి అయ్యింది. పెళ్ళైన కొత్తల్లో మొత్తం బాగానే ఉండేది. నాగార్జున అమెరికా లో పెరిగిన అబ్బాయి కాబట్టి, అక్కడి కల్చర్ కి బాగా అలవాటు పడ్డాడు.

nagarjuna-amala

ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మాయిలతో తిరగడం, పార్టీలకు, పబ్బులకు వెళ్లడం వంటివి చేస్తుండేవాడు. అదంతా కల్చర్ లో భాగమే కదా అని లక్ష్మి కూడా అంతగా పట్టించుకునేది కాదు. కానీ వీళ్ళ మధ్య గొడవలు ప్రారంభం అయ్యింది నాగార్జున ఇండస్ట్రీ లోఇకి అడుగుపెట్టిన తర్వాతే. 1986 వ సంవత్సరం లో నాగార్జున ‘విక్రమ్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాకి మంచి టాక్ రావడం తో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయం లో దాసరి నారాయణ రావు దర్శకత్వం లో వచ్చిన ‘మజ్ను’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.

nagarjuna-lakshmi-daggubati

నాగార్జున కి లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రజిని నటించింది. ఇప్పటి ఆడియన్స్ కి ఈమె పెద్దగా తెలియదు ఏమో కానీ, అప్పట్లో పెద్ద స్టార్ హీరోయిన్. అయితే మజ్ను సినిమా సూపర్ హిట్ అవ్వడం తో నాగార్జున రజిని తో కలిసి కలెక్టర్ గారి అబ్బాయి, మురళి కృష్ణుడు, అగ్ని పుత్రుడు వంటి సినిమాల్లో నటించారు. వీళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దానిని స్నేహం అని ఎవరూ అనుకోరు, ఆ రేంజ్ అన్నమాట. వీళ్ళ మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటూ రూమర్స్ రావడం తో లక్ష్మీ దగ్గుపాటి చాలా డిస్టర్బ్ అయ్యింది(Nagarjuna Amala Lakshmi).

rajani-nagarjuna

తరచు దీని వల్ల గొడవలు జరిగేవి. ఇదంతా గమనించిన రామానాయుడు ‘అగ్నిపుత్రుడు’ సినిమా షూటింగ్ సమయం లో రజిని ని పిలిచి ప్రత్యేకంగా క్లాస్ పీకి పంపించాడట. అప్పటి నుండి ఈమె నాగార్జున వైపు చూడడం కూడా ఆపేసింది. నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలైయ్యే అవకాశం ఉంది.

అక్కినేని వారివి ఈ ఏడాది ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వటం లేదు. రిలీజ్ ఆయిన ఏకైక సినిమా ఏజెంట్, అఖిల్ హీరో గా నటించిన ఈ సినిమా పెద్ద డిసాస్టర్ అనే చెప్పాలి. అక్కినేని వారి చరిత్రలోనే ఇంత చెత్త సినిమా లేదు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts