Home Cinema సంచలనం రేపుతున్న కుమారి ఆంటీ కామెంట్స్.. చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిందా..?

సంచలనం రేపుతున్న కుమారి ఆంటీ కామెంట్స్.. చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిందా..?

did-kumari-aunty-reject-movie-offer-with-megastar-chiranjeevi-and-balakrishna

Kumari Aunty : కుమారి ఆంటీ అంటే ప్రస్తుతం తెలియని వారు ఉండరు. సోషల్ మీడియా సహాయంతో ఒక నెలలోనే అందరూ చర్చించునే టాపిక్ అయ్యింది కుమారి ఆంటీ. ‘మీది మొత్తం వెయ్యి అయింది, రెండు లివర్లు ఎక్స్ట్రా’. ఈ ఒక్క డైలాగ్ వైరల్ అవ్వటంతో సోషల్ మీడియా లో ఉండే సెలెబ్రిటీలందరు ఈ డైలాగ్ తో రీల్స్ చేసి కుమారి ఆంటీ ని ఇంకా ఫేమస్ చేసేసారు. ఒకపుడు రోజుకి 5 వేలు అమ్ముకునే కుమారి ఆంటీ ఇప్పుడు రోజుకి లక్ష వరకు అమ్ముతుంది.

అది సోషల్ మీడియాకు ఉన్న పవర్. వైరల్ అయిన తరువాత కుమారి ఆంటీ చాల ప్రోగ్రాంలకు అతిధిగా వెళ్లారు. మల్ల రెడ్డి కాలేజీ వారు కూడా అంటీని వారి కాలేజీకి పిలిపించుకుని తిన్నారు. అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లోను కుమారి గారు కనిపించారు. అక్కడ వెళ్లి హైపర్ ఆది, రష్మీ, ఇంద్రజ మరియు వారి సిబ్బంది మొత్తానికి భోజనం కూడా పెట్టింది కుమారి ఆంటీ.

ఆ షోకి వెళ్లినందుకు తనకు ఏమి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అట కానీ తను పెట్టిన భోజనానికి డబ్బులు ఇచ్చారు అట. ఆ తరువాత ఆంటీ షాప్ ని పోలీసులు మూసేయటం, సీఎం రేవంత్ రెడ్డి అంటీకి మల్లి పర్మిషన్ ఇవ్వటం కూడా అందరిని మెప్పించింది. ఇటీవలే కుమారి ఆంటీ కి రెండు సినిమాలో నటించే ఛాన్స్ కూడా వచ్చింది అట. కానీ దానికి ఆవిడ షాప్ నుంచి నెలరోజులు దూరంగా ఉండటం ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఆ రెండు సినిమాలు చిరంజీవి మరియు బాలకృష్ణ వి అంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.

Exit mobile version