Home Cinema Nithya Menen: నిత్యా మీనన్ ఇంత మంది హీరోలతో అఫైర్స్ పెట్టుకుందా..? వామ్మో..

Nithya Menen: నిత్యా మీనన్ ఇంత మంది హీరోలతో అఫైర్స్ పెట్టుకుందా..? వామ్మో..

Nithya Menen: నేటి తరం సౌందర్య గా పేరు తెచ్చుకున్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు నిత్యా మీనన్. ‘అలా మొదలైంది’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన తోటి స్టార్ హీరోయిన్స్ లాగ కాకుండా తనకంటూ కొన్ని సిద్ధాంతాలను పెట్టుకొని వాటిని తూచా తప్పకుండ ఫాలో అయ్యే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినా తన క్యారక్టర్ కి నటనలో ప్రాధాన్యత ఉంటేనే సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటుంది.

nithya-menen-love-with-heros

ఆమె నటించిన సినిమాలన్నీ చూస్తే మీకు ఆ విషయం అర్థం అవుతాది. అందుకే నిత్యామీనన్ ని ప్రతీ ఒక్కరు ఎంతగానో ఇష్టపడుతారు. అయితే నటిగా ఇంత మంచి ఉన్నత విలువలు పాటించే నిత్యా మీనన్(Nithya Menen) చాలా మంది హీరోలతో ప్రేమాయణం నడిపింది అనే విషయం మీకు తెలుసా.? వాస్తవానికి ఈమె మలయాళం ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్, టాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే అక్కడ ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఎక్కువగా ఆమె మమ్మూటీ కొడుకు దుల్కర్ సల్మాన్ తోనే సినిమాలు చేసింది. దీంతో అప్పట్లో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, దుల్కర్ సల్మాన్ ఇందుకోసం తన భార్య కి కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ అప్పట్లో ఒక వార్త తెగ హల్చల్ చేసింది.

ఇక టాలీవుడ్ లోకి వచ్చిన తర్వాత ఈమె నాని తో కూడా ప్రేమాయణం నడిపింది అని అంటుంటారు. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ తో కలిసి ఈమె ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలు చేస్తున్న సమయం లో కూడా వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుంది అంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తోను, అలాగే ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ సినిమా సమయం లో శర్వానంద్ తోను ఈమె ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి.

అయితే వీటిల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, నిత్యా మీనన్ ప్రతీ హీరో తో మంచి స్నేహ బంధం ఏర్పాటు చేసుకోవడం వల్లే ఆమె మీద ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అని ఆమె అభిమానులు అంటున్నారు. ఇకపోతే నిత్యా మీనన్ ప్రస్తుతం అధికంగా మలయాళం లోనే సినిమాలు చేస్తుంది. తెలుగు లో ఆమె నటించిన ఆఖరి చిత్రం భీమ్లా నాయక్. ఇటీవలే నిత్య మీనన్ కు ఎంత ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోయారు. నిత్యా ప్రస్తుతం అన్ని సినిమాలు ఆపేసి, అన్ని కారిక్రమాలు పూర్తి అయ్యాక మల్లి సినిమాలు ప్రపంబిస్తుంది అని సినీ వర్గాల్లో వచ్చిన న్యూస్.

Exit mobile version