Home Cinema Mahesh Babu : బ్లాక్ లో టిక్కెట్లు కొని ఆ సినిమా చూసాను.. మహేష్ వ్యాఖ్యలు...

Mahesh Babu : బ్లాక్ లో టిక్కెట్లు కొని ఆ సినిమా చూసాను.. మహేష్ వ్యాఖ్యలు వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనే సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు పాన్-ఇండియన్ దర్శకుడితో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఇది ఆక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు దర్శకుడు రాజమౌళి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు రాజమౌళి, మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ఎలా ఉంటుంది? మరి ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నలు అందరికి ఉన్నాయి. గత కొంత కాలంగా ఈ సినిమాలో అమీర్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

mahesh-babu-buys-block-tickets-to-watch-this-movie

ఇదిలా ఉంటె మహేష్ బాబు బ్లాక్ టిక్కెట్లు కొని ఆ సినిమా చూశారు అని స్వయంగా ఆయనే చెప్పారు. మహేష్ గతంలో టీవీ షోలలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లలో హల్‌చల్ చేస్తోంది. మీరు చిన్నప్పుడు లైన్‌లో టిక్కెట్లు కొన్నారా అని మహేష్‌ను అడిగారు యాంకర్. రంగీలా సినిమాకి క్యూలో టిక్కెట్లు దొరక్క థియేటర్ వద్ద బ్లాక్ లో కొన్ని సినిమా చూశారట మహేష్. ప్రస్తుతం మహేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version