Home Cinema Mahesh Babu : మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..

Mahesh Babu : మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..

mahesh-babu-fans-disappointed-due-to-this-reason

Mahesh Babu : మహేష్ బాబు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అంటూ ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం పదండి. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గుంటూరు కారం చిత్రం. ఇది మహేష్ బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల లిస్టులో ఉంటుంది. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ అందించిన ఆల్బమ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో కట్ చేసిన ఏడవ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా OTT లో కూడా వచ్చేసింది కానీ ఈ చిత్ర యూనిట్ ఈ పాట ను రిలీజ్ చేయనేలేదు. ఇటీవల థమన్ తన ఇంస్టాగ్రామ్ ఛానల్ లో పెట్టిన ఓ పోస్ట్ మహేష్ బాబు అభిమానులకు ఆశలు రెప్పింది. ఆయన ఓ పోస్ట్ టైటిల్ గా మిరపకాయ్ యొక్క ఎమోజి పెట్టడంతో అభిమానులు ఖచ్చితంగా ఇది గుంటూరు కారం యొక్క ఏడవ పాట అని అనుకుంటున్నారు.

mahesh-babu-fans-disappointed

అయితే తీరాచూస్తే అది, తన స్పైస్ టూర్ కు సంబందించిన అప్డేట్ అని తెలుస్తుంది. దాంతో మహేష్ బాబు అభిమానులంతా నిరాశకు గురయ్యారు. మరి ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పాటను తమన్ ఎప్పుడు విడుదల చేస్తాడో వేచి చుడాలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనిలో బిజీ బిజీ ఉన్నాడు. ఈ సినిమాను అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు జక్కన. ఈ సినిమాపై అభిమానులకు బారి అంచనాలు ఉన్నాయి.