Friday, July 5, 2024
HomeCinemaRajinikanth : ఇతని సినిమాలో అనవసరంగా నటించాను.. రజినీకాంత్ పై స్టార్ హీరోయిన్ కామెంట్స్..

Rajinikanth : ఇతని సినిమాలో అనవసరంగా నటించాను.. రజినీకాంత్ పై స్టార్ హీరోయిన్ కామెంట్స్..

Rajinikanth : మలయాళ స్టార్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి అందరికి తెలుసు. ఈమె నటి మరియు గాయని. 2007లో విడుదలైన యమదొంగ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది ఈ భామ. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫిక్షన్ చిత్రంలో ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా, కామెడీ గా ఉంటాయి. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో నటించింది ఈ అందాల భామ.

2008లో వాసు దర్శకత్వం వహించిన కుచేలన్ చిత్రంలో మమతా మోహన్ దాస్ ఒక పాటలో కనిపించారు. రజనీకాంత్ జీవితానికి దగ్గరగా ఉండేలా ఈ సినిమా తీశారు. నయనతార కథానాయికగా నటించింది. తెలుగులో కథానాయకుడు పేరుతో ఈ సినిమాను విడుదల చేసారు. రజనీకాంత్ చిన్ననాటి స్నేహితుడి పాత్రలో జగపతిబాబు నటించారు. మినా అతని భార్య గా కనిపిస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, కుచేలన్ సినిమాలోని ఓ పాట కోసం మమతా మోహన్ దాస్ రెండు రోజుల పాటు చిత్రీకరించారు.

mamta-mohan-das-stated-she-regreted-doing-cinema-with-rajinikanth

తీరా చిత్రం విడుదలైన తర్వాత, మమతా దాస్ ఈ పాటలో కేవలం ఒక సెకను మాత్రమే కనిపించారు. ఈ ప్రక్రియతో సతమతమవుతున్న మమతా మోహన్ దాస్ కుచేలన్ సినిమాలో అనవసరంగా నటించానని అంటారు. మమతా మోహన్ దాస్ పార్ట్ ఎడిటింగ్ లో తీసివేయడానికి కారణం నయనతార అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పాటలో నయనతారతో పాటు మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఆమెకు చెప్పలేదు. దీంతో నయనతార దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసి తన పాత్రను తిరస్కరించినట్లు సమాచారం.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts