Friday, September 20, 2024
HomeCinemaSridevi : శ్రీదేవి తన సొంత చెల్లిని డబ్బు విషయం లో ఇంత దారుణంగా మోసం...

Sridevi : శ్రీదేవి తన సొంత చెల్లిని డబ్బు విషయం లో ఇంత దారుణంగా మోసం చేసిందా..

Sridevi : ఎంత మంది హీరోయిన్స్ ప్రతీ ఏటా పుట్టుకొచ్చిన అందం అనే ప్రస్తావన తీసుకొస్తే ఎవరైనా అతిలోక సుందరి శ్రీదేవి ని గుర్తు చేసుకుంటారు. బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి, ఆ తర్వాత 18 ఏళ్లకే హీరోయిన్ గా మారిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణబా, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున మరియు వెంకటేష్ ఇలా దాదాపుగా అన్ని జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి నటించిన శ్రీదేవి, తమిళం లో కూడా ఆరోజుల్లో ఇదే రేంజ్ సెన్సేషన్ సృష్టించింది(Sridevi Cheated Her Sister). ఆ తర్వాత ఈమెకి బాలీవుడ్ లో అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాక, మళ్ళీ సౌత్ వైపు చూడాల్సిన అవసరం రాలేదు.

sridevi

అక్కడే స్థిరపడిపోయింది. అక్కడ దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించి, సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న శ్రీదేవి, అప్పుడప్పుడు టాలీవుడ్ లో నటిస్తూ ఉండేది. అయితే ఈమెకి శ్రీలత అనే చెల్లెలు కూడా ఉంది. ఈమెకి కూడా హీరోయిన్ అవ్వాలనే కోరిక మనసులో చాలా ఉండేది. కానీ పరిస్థితులు అనుకూలించక ఆమె శ్రీదేవి కి మ్యానేజర్ గా మారింది. 1972 వ సంవత్సరం నుండి 1993 వ సంవత్సరం వరకు శ్రీలత శ్రీదేవి తో పాటుగా షూటింగ్ సెట్స్ లో కనిపించేది. ఆమెకి అవసరమయ్యే ప్రతీ కార్యక్రమం శ్రీలత నే చూసుకునేది. అయితే వీళ్లిద్దరి కన్నతల్లి రాజేశ్వరి చనిపోవడం తో అక్కా చెల్లెళ్ళ మధ్య చిచ్చు రేగింది.

sridevi-cheated-her-sister

అసలు విషయానికి వస్తే శ్రీదేవి తల్లి కి ఒకసారి అనారోగ్యం వస్తే హాస్పిటల్ లో చేర్పించారు. డాక్టర్లు కచ్చితంగా ఆమెకి ఆపరేషన్ చేయించాలి అని చెప్పగా ఆపరేషన్ చేయించారు. కానీ డాక్టర్ చేసిన పొరపాటు కారణంగా శ్రీదేవి తల్లి రాజేశ్వరి కి జ్ఞాపక శక్తి పోయింది. అది ఆమెని 1996 వ సంవత్సరం లో చనిపోయేందుకు కారణం అయ్యింది. దీంతో శ్రీదేవి ఆ హాస్పిటల్ పై కేసు పెట్టగా హాస్పిటల్ నుండి 7.2 కోట్ల రూపాయిలు వచ్చింది. అయితే ఈ డబ్బులు శ్రీదేవి తన దగ్గరే ఉంచుకుంది కానీ, నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ శ్రీలత పోలీస్ కేసు పెట్టింది(Sridevi Cheated Her Sister).

actress-sridevi

అప్పట్లో ఈ సంఘటన ఒక సంచలనం అనే చెప్పాలి. అలా తల్లి మరణం ఈ ఇద్దరి అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె శ్రీదేవి కుటుంబం తో మంచిగానే ఉంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం తన అదృష్టాన్ని టాలీవుడ్ లో పరీక్షించుకుంటుంది. బాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేకపోవటంతో నటి ఇప్పుడు తెలుగు సినిమాలో ప్రయత్నిస్తుంది.

తెలుగు లో మొదటి సినిమానే ఎన్టీఆర్ తో కలిసి చేస్తుంది. దానికి కారణం తన తల్లి శ్రీదేవి అని చెప్పుకోవచ్చు, లేకపోతే టాలీవుడ్ లో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో మొదటి సినిమాకి ఛాన్స్ రావటం అనేది మామూలు విషయం కాదు. దేవర సినిమా గురించి మరికొన్ని అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts