Friday, July 5, 2024
HomeCinemaNagarjuna : పూరి జగన్నాద్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున.. ఫాన్స్ కు పండగే..

Nagarjuna : పూరి జగన్నాద్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున.. ఫాన్స్ కు పండగే..

Nagarjuna : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. పూరి అతి తక్కువ కాలంలోనే సినిమాను తీసి విడుదల చేయడంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. సినిమా షూటింగ్ మొదలుపెట్టాక ముందే విడుదల తేదీని ప్రకటించే గట్స్ ఉన్న దర్శహకుడు పూరి. అందుకే ప్రేక్షకులు అతన్ని డైనమిక్ డైరెక్టర్ అని ప్రేమగా పిలుచుకుంటారు. అయితే గత కొంత కాలంగా ఈయన టైమ్ బాలేదని చెప్పాలి. ఈయన తీసిన చివరి హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్.

ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ కలిసి పాన్ ఇండియా సినిమా లైగర్ తీసాడు. ఈ సినిమా బారి డిసాస్టర్ గా నిలిచింది. పూరి ప్రస్తుతం రామ్ పోతినేని తో కలిసి తన హిట్ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ఈ సినిమా హిట్ అవుతుంది అని నమ్ముతున్నారు. ఇస్మార్ట్ శంకర్ విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ చేయబోయే సినిమా గురించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

puri-jagannadh-next-cinema-with-nagarjuna-announcement-soon

అయితే, పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ కింగ్ నాగార్జునతో ప్లాన్ చేస్తున్నాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా పూరి నాగార్జున ను కలిసి ఓ కథ కూడా చెప్పారట. నాగార్జున కూడా వెంటనే అంగీకరించారు. నాగార్జున కుబేరుడు తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు పూరి జగన్నాద్. ఇప్పుడు ఇదే వార్త సోషల్ నెట్‌వర్క్‌లలో హల్‌చల్ చేస్తోంది. వీరి కాంబినేషన్ లో అప్పట్లో శివమణి సినిమా వచ్చింది. ఈ సినిమా బారి విజయం అందుకుంది. ఈ ప్రాజెక్ట్ పై అక్కినేని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts