Friday, September 20, 2024
HomeCinemaRashmi: రాత్రికి వస్తావా అని యాంకర్ రష్మిని దారుణంగా అవమానించిన కమెడియన్.. ఎవరంటే..

Rashmi: రాత్రికి వస్తావా అని యాంకర్ రష్మిని దారుణంగా అవమానించిన కమెడియన్.. ఎవరంటే..

Rashmi: ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరియు పంచులతో నిండిపోయి ఉంటుంది. ఇది యూత్ కి చాలా బాగానే అనిపిస్తుంది కానీ, కుటుంబం తో కలిసి కూర్చొని కాసేపు చూడలేము. ఆ రేంజ్ డైలాగ్స్ ఉంటాయి. జబర్దస్త్ షో అలాంటిదే, ఆ షో గత పదేళ్ల నుండి విజయవంతంగా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతూ ఉండడం తో ఈటీవీ అలాంటి షోస్ ని చాలా ప్లాన్ చేసింది(Comedian Insulted Anchor Rashmi). అన్నీ సక్సెస్ అయ్యాయి, వాటిల్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ గురించి.

comedian-insulted-anchor-rashmi

ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే, అప్పట్లో ఈ షో కి వ్యాఖ్యాతగా సుడిగాలి సుధీర్ వ్యవహరించగా, ఇప్పుడు రష్మీ చేస్తుంది. అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ స్కిప్ట్స్ తో ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది ఈ కామెడీ షో. అయితే రీసెంట్ గా జరిగే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుంతుంది. ఇది వరకు హైపర్ ఆది మాత్రమే డబుల్ మీనింగ్ వచ్చే డైలాగ్స్ పంచులు ఎక్కువగా వేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కొత్తగా ఆటో రామ్ ప్రసాద్ కూడా మొదలెట్టాడు.

rashmi-gautam

ఈ ప్రోమో రష్మీ ని రాత్రికి వస్తావా అని అడుగుతాడు రామ్ ప్రసాద్(Comedian Insulted Anchor Rashmi). రాత్రికి నేను రావడం ఏంటి అని రష్మీ అనగా, రాత్రికి రా చెప్తా అని రామ్ ప్రసాద్ మరోసారి అనగా, అక్కడే ఉన్న ఇంద్రజ రామ్ ప్రసాద్ పై అరుస్తుంది. అప్పుడు ఆయన మా ఊర్లో రాత్రి జాతర జరుగుతుంది, అందుకే రాత్రికి వస్తావా అని పిలుస్తున్నా మేడం అని కవర్ చేస్తాడు. ఈ పంచ్ బాగా పేలడం తో అక్కడ ఉన్న వాళ్లంతా నవ్వారు. ఇక రష్మీ ఆ మాట ని అంత స్పోర్టివ్ గా తీసుకోవడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత స్పోర్టివ్ గా ఉండబట్టే ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

anchor-rashmi

యాంకర్ గా రాణించిన ఈమె, సినిమాల్లో కూడా గొప్పగా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించింది. గతం లో తీసిన సినిమాలు అన్నిటిలో స్టోరీ కంటే ఎక్కువ రొమాన్స్ ఉండటంతో కుర్రాళ్లకు తప్ప ఫామిలీ కి దెగ్గర కాలేకపోయింది రష్మీ అనే చెప్పుకోవాలి. ఇప్పటికైనా మంచి స్టోరీ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నారు ఫాన్స్.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts