Tuesday, May 7, 2024
HomeCinemaKeerthy Suresh : వేణు స్వామి వెంటపడుతున్న హీరోయిన్ కీర్తి సురేష్.. కారణం ఇదే..

Keerthy Suresh : వేణు స్వామి వెంటపడుతున్న హీరోయిన్ కీర్తి సురేష్.. కారణం ఇదే..

Keerthy Suresh : ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో వేణు గోపాల స్వామి అనే జ్యోతిష్యుడు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడో మన అందరికీ తెలిసిందే. అప్పట్లో బాబు గోగినేని అనే వ్యక్తి ఇతని దొంగ జ్యోతిష్యుడు అని ఒక మీడియా న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో ఆధారాలతో సహా నిరూపించాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం నమ్ముతుంది. ఎందుకంటే కొంతమంది హీరోలు మరియు హీరోయిన్స్ విషయం లో ఈయన చెప్పిన ప్రతీ మాట నిజమైంది(Keerthy Suresh Venu Swamy). అందుకే అలా నమ్ముతున్నారు, సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని, ప్రభాస్ కి ఇక నుండి అన్నీ ఫ్లాప్స్ పడుతాయని, అల్లు అర్జున్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తాడని చెప్పాడు.

venu-swamy-nidi-agarwal

ఆయన చెప్పినవి చెప్పినట్టు తూచా తప్పకుండ జరగడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. జ్యోతిష్యాన్ని చాలా కామెడీ గా చెప్పేస్తున్నాడు ఆయన. అందుకే కొంతమంది హీరోయిన్స్ కన్ను వేణు గోపాల స్వామి మీద పడింది. ఇప్పటికే ప్రముఖ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ వేణు గోపాల్ స్వామి ని కలిసి ప్రత్యేక పూజలు చేయించింది. ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో లేదని, చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని, జాతకం లో చాలా దోషాలు ఉన్నాయని వేణు స్వామి చెప్పడం తో దోష నివారణ చేయించుకుంది. ఫలితంగా ఆమెకి ఏకంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది.

venu-swamy

ఇప్పుడు ఆమె లాగానే కీర్తి సురేష్ కూడా వేణు గోపాల స్వామిని కలిసి దోష నివారణ పూజలు చేయించుకోవాలని అనుకుంటుంది(Keerthy Suresh Venu Swamy). ఎందుకంటే కీర్తి సురేష్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తో ఆమె చేసిన ‘భోళా శంకర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అందుకే కెరీర్ సాఫీ గా సాగాలని, మునుపటి వైభవం రావాలనే ఉద్దేశ్యం తో కీర్తి సురేష్ దోష నివారణ పూజ చేయించుకోవాలని అనుకుంటుంది అట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. దీనిపై నెటిజెన్స్ ట్రోల్ల్స్ కూడా చేస్తున్నారు.

actress-keerthy-suresh-venu-swamy

సెలెబ్రిటీలు అయ్యుండి వేణు గోపాల స్వామి లాంటోడిని ఎలా నమ్ముతున్నారని, అతను వేసేవి దొంగ వేషాలు, ఆధారాలతో సహా రుజువు అయ్యింది, అయినా కూడా అతనిని ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం రెండు తమిళ్ ఒక తెలుగు సినిమా లో నటిస్తుంది. తిను తెలుగు లో చివరిగా కనిపించిన సినిమా దసరా.

హీరో నాని తో కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ యాక్టింగ్ కి డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు అనటంలో ఎటువంతి అతిశయోక్తి లేదు. అభిమానులు కీర్తి సురేష్ తరువాత సినిమా ఎపుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts